Sandeep Kumar Jha | సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 8: పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి పరిశీలించారు. సిలబస్ ఎక్కడి వరకు పూర్తి అయిందని ప్రిన్సిపాల్ను ఆరా తీయగా.. ఇప్పటికే పూర్తి అయిందని, ప్రస్తుతం రివిజన్ చేయిస్తున్నామని ప్రిన్సిపాల్ థెరిసా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపేలా సిద్ధం చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు సూచించారు. పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ ఉపాధ్యాయినులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sandeep Kumar Jha 1
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా