ఎల్లారెడ్డిపేట డేకేర్ సెంటర్లో మంత్రి కేటీఆర్కు తన బాధను మొరపెట్టుకుంటున్న ఆకారం నర్సయ్య(ఫైల్)
అన్నా అంటే నేనున్నా అంటూ ఆపదలో ఉండే వారికి అండగా నిలిచే మంత్రి కేటీఆర్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన దివ్యాంగుడు ఆకారం నర్సయ్యకు అభయమిచ్చాడు. ఆటో అందించి భరోసా కల్పించారు. పుట్టుకతోనే పోలియో బారినబడి రెండుకాళ్లు చచ్చుబడిపోయినప్పటికీ బతుకు దెరువు కోసం ఆటో నడుపుతూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఆయన భార్య కొంత కాలం క్రితం మృతి చెందగా, ఇద్దరు కూతుళ్ల పోషణ ఇబ్బందిగా మారింది. అయితే ఆటో పూర్తిగా చెడిపోవడంతో అమ్మేసి పనిలేక ఇబ్బందులు పడుతున్నాడు.
గత ఫిబ్రవరి 28న మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాగా, నర్సయ్య తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఒక ఆటో ఇప్పించాలని మొర పెట్టుకున్నాడు. అప్పటికప్పుడు కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడి మార్చి 2న కొత్త ఆటోను నర్సయ్యకు అందించారు. ఓ పక్క బతుకుదెరువు కోసం ఆటోను ఇప్పించడమే గాకుండా తమలాంటి దివ్యాంగులకు పెన్షన్ ఇస్తూ భరోసా కల్పిస్తున్న మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని నర్సయ్య చెబుతున్నాడు.
– ఎల్లారెడ్డిపేట, జూలై 23