హైదరాబాద్, జూలై 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విశ్రాంత ఉద్యోగుల పెండింగ్ కమ్యూటేషన్ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
మే 29న మొదటి విడుత రూ.2వేల కోట్లు, జూన్ 30న రూ.2వేల కోట్లు, తాజాగా జూలై 30న మరో రూ.2వేల కోట్లు విడుదల చేశారు. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో రూ. 6వేల కోట్ల బకాయిలను విడుదల చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మిగతా ఇతర బకాయిలను కూడా క్లియర్ చేస్తామని పేర్కొన్నారు.