సిరిసిల్ల రూరల్, మార్చి 24: తంగళ్ళపల్లి మండలంలో సిరిసిల్ల- సిద్దిపేట రహదారిలోని బద్దెనపల్లి చౌరస్తా ప్రమాదకరంగా మారింది. సిరిసిల్ల సిద్దిపేట రహదారితో పాటు బద్దెనపల్లి నుంచి రామన్న పల్లె, బస్వాపూర్, రామోజీపేట మీదుగా ఇల్లంతకుంట వరకు వెళ్తుంటారు. మరోవైపు బద్దెనపల్లి చౌరస్తా నుంచి ఇందిరమ్మ కాలనీ, కెసిఆర్ నగర్ మీదుగా మండే పెళ్లి , రాళ్లపేట, కట్కూర్, గండి లచ్చపేట ముస్తాబాద్ మండలం వరకు రోజు భారీగా వాహనాలు వెళుతున్నాయి.
దీంతో బదనపల్లి చౌరస్తా ట్రాఫిక్ మరింత పెరిగింది. రహదారిపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో చౌరస్తాలో వాహనాలు అదుపుతప్పి, ఇతర కారణాలతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు దాటాలంటే స్థానికులు జంకుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, స్పీడ్ బ్రేకర్లు, సూచిక బోర్డులు, ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.