వేములవాడ రూరల : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అగ్రహారం జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు మౌలిక వసతులు కల్పించాలని వేములవాడ సిరిసిల్ల – రహదారిపై విద్యార్థులు రాస్తారోకో చేట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జేఎన్టీయూ కళాశాలలో మౌలిక వసతులను కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. మూడు రోజుల క్రితం విద్యార్థులమంతా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ గోడును కలెక్టర్కు విన్న వించు కుచ్చుకున్నామన్నారు.
సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన అధికారులు ఇప్పటివరకు ఇలాంటి పురోగతి లేదని వాపోయారు. దాదాపు రెండు గంటల పాటు రాస్తారోకో చేయగా రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు విద్యార్థులు బలవంతంగా రోడ్డుపై నుంచి పక్కకు నెట్టు వేశారు. 9 మంది విద్యార్థులను పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్ కు తరలించారు.