తెలంగాణ ప్రజల అస్తిత్వానికి బీఆర్ఎస్ ప్రతీక అని, పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం సిరిసిల్లలోని మొదటి బైపాస్ రోడ్డులో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం (తెలంగాణ భవన్)ను పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మంత్రి ప్రసంగించారు. సిరిసిల్లలో అత్యాధునికంగా నిర్మించిన తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం కావడం ఆనందంగా ఉందని, ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు అభినందనలు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల/ సిరిసిల్లటౌన్: బీఆర్ఎస్ పార్టీ శాశ్వతంగా ఉండాలనే జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నామని, తెలంగాణ ఆత్మగౌరవానికి బీఆర్ఎస్ చిహ్నమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:30 గంటలకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి 11:43 గంటలకు మంత్రి గంగుల , కేశవరావు, వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి తెలంగాణ భవన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి 12:20 గంటలకు తెలంగాణ నూతన భవనంలో అధునాతనంగా నిర్మించిన తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి కేటాయించిన చాంబర్లో వారిని కూర్చోబెట్టి, సర్వమత ప్రార్థనలు చేయించారు. అనంతరం వారిని అభినందించా రు. అక్కడి నుంచి తెలంగాణ భవన్లో రెండో అంతస్తులో ముఖ్యకార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు.
పార్టీ కార్యాలయాలు కార్యకర్తల ఆస్తి. సిరిసిల్ల పార్టీ ఆఫీ స్ను అధునాతనంగా నిర్మించాం. అన్ని కార్యక్రమాలకు అనువుగా ఉండేలా మొదటి అంతస్తులో సమావేశ మం దిరం, గ్రౌండ్ ఫ్లోర్లో డైనింగ్ హాల్, బస కోసం గదులను నిర్మించాం. త్వరలో టెలీకాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి నిత్యం కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో మాట్లాడే అవకాశం కల్పిస్తాం. తెలంగాణ భవనం నిత్యం కల్యాణం పచ్చతోరణంలా నిర్వహణ చేపట్టాలని జిల్లా అధ్యక్షుడికి సూచిస్తున్నా. 60 లక్షల పార్టీ సభ్యత్వాలున్న అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్సే. పార్టీ కార్యకర్తల్లో పేదలున్నారు. వారి ఇండ్లలో జరిగే శుభకార్యాలను అతి తక్కువ నిర్వహణ ఖర్చులు చెల్లించి తెలంగాణ భవన్లో జరుపుకునే విధంగా సహకరించాలి. పార్టీలో అనాథలుంటే వారి పెళ్లిళ్లు పార్టీ తరఫున చేయిస్తాం. కులంతార వివాహాలకు ప్రోత్సాహం కల్పిస్తాం. ఇక నుంచి తెలంగాణ భవన్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలి. సిరిసిల్లకు వచ్చిన ప్రతి కార్యకర్త తెలంగాణ భవన్కు రావాలి. ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చే ప్రజలు తెలంగాణ భవన్కు వచ్చి దరఖాస్తులు ఇవ్వాలి. భవన్లో మీడియా పాయింట్ ఏర్పాటు చేసి ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాల ను ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్మీట్లు పెట్టాలి. రానున్న రోజుల్లో నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ భవన్ను నిర్మిస్తాం. వేములవాడ రాజకీయ కార్యకలాపాలు, సమావేశాలు ఇక్కడే నిర్వహించుకోవాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకలుగా తెలంగాణభవన్లు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు బాస్లు ఢిల్లీలో ఉంటారని, బీఆర్ఎస్కు మాత్రం గల్లీలో ఉన్నారని, పైన కేసీఆర్, కింద ప్రజలు మంచిగున్నారని, మధ్యలోనే తెల్ల అంగి నాయకులతో సమస్యలున్నాయని సభలో మంత్రి నవ్వులు పూయించారు.
‘తెలంగాణను కేసీఆర్ తండ్రిలాగా కాపాడుతున్నారు. కేసీఆర్ను తిడితే ఓట్లు పడతాయని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి. కానీ, తెలంగాణను కేసీఆర్ కంటే ఎక్కువగా ప్రేమిస్తే తప్ప ఓట్లు పడయన్న విషయం వారికి ఇంకా అర్థం కావడం లేదు. కాంగ్రెస్, బీజేపీలే బీఆర్ఎస్ పథకాలను కాపీ కొడుతున్నాయి. 58 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తాజాగా, విడుదల చేసిన మ్యానిఫెస్టోలో రైతుబంధుకు డబ్బులు ఇస్తామని ప్రకటించింది. అసలు రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది కేసీఆరే. ప్రధాని మోదీ తెలంగాణ పథకాలను కాపీ కొట్టి కేంద్రంలో అమలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన మ్యానిఫెస్టోల ను 90 నుంచి 95శాతం అమలు చేశారు. మ్యానిఫెస్టోలను పవిత్రమైన గ్రంథాలుగా గౌరవిస్తూ అమలు చేస్తున్నారు. రెండు సార్లు రుణామాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్దే.’
‘సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో నాకు ఇష్టమైన పథకం కేసీఆర్ బీమా. ఈ పేరును నేనే సూచి ంచా. తెలంగాణలోని దాదాపు 93 లక్షల తెలుపు కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ విషయాన్ని ప్రజలకు వివరించాలి. కాళేశ్వర జలాలతో రాష్ట్రం అన్నపూర్ణగా మారింది. జిల్లాలోని ఇల్లంతకుంటలో దాదాపు 25 వేల ఎకరాలు అదనంగా సాగవుతున్నది. బడి పిల్లలకు టిఫిన్, సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నాం. సౌభాగ్యలక్ష్మి ద్వారా అర్హులైన మహిళలకు రూ.3 వేలు అందిస్తాం.
‘ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామగ్రామాన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరించాలి. ప్రతి ఇంటికీ చేరిన సంక్షేమ పథకాలు, గ్రామంలో జరిగిన అభివృద్ధి క్రమాన్ని, కేటాయించిన నిధులను వివరించాలి. తొమ్మిదేండ్లలో గ్రామాభివృద్ధిని వివరిస్తూ బ్రోచర్ల ద్వారా ప్రచారం చేయా లి. పార్టీ శ్రేణులు 45 రోజులు కష్టపడితే ఐదేండ్లు మీ కోసం కష్టపడుతాం.’ అని సూచించారు. అసెంబ్లీ ఎన్నిక ల్లో వేదికపై ఉన్న పంచ పాండవులు( కేటీఆర్, గంగుల, చల్మెడ, రసమయి, సుంకె )ను గెలిపించాలని మంత్రి కోరడంతో సభాప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.
బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలను ఆహ్వానించాలని మంతి కేటీఆర్ సూచించారు. ప్రతి ఒక్కరం ఓటరు దగ్గరికి పోయి ఓట్లు అడగాలని సూచించారు. 90 నుంచి 95 సీట్లు గెలిస్తేనే మనకు మంచిదని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలుపు చూసి మహారాష్ట్రలోని ఎమ్మెల్యేలు మన పార్టీలోకి రావాలని ఉత్సుకత చూపిస్తున్నారని తెలిపారు.
సిరిసిల్లలో అత్యాధునికతో తెలంగాణ భవన్ నిర్మాణానికి చొరవ చూపి శ్రమించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్ నిర్మాణం కోసం తన వంతుగా కృషి చేసి అందంగా నిర్మించారని కొనియాడారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ భవన్ ఎదుట ఎన్నికల ప్రచార రథాన్ని మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొం డూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు. కార్యకర్తలు చెప్పినట్లే పార్టీ ప్రతినిధులు ముందుకెళ్లాలి. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని పనిచేయండి. అభ్యర్థులు సామాజిక సేవలో అంకితంకావాలి. గ్రామాల్లో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో గురిం చి చర్చలు జరుపాలి. 93లక్షల మంది రేషన్కార్డుదారులకు బీమా సదుపాయం గురించి వివరించండి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాతో నాకు 60ఏండ్ల నుంచి అనుబంధం ఉంది. మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం ప్రకారం పార్టీ శ్రేణులు నడుచుకొని ఓటర్లను ఆకట్టుకోవాలి. మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి వారికి అవగతం కల్పించండి. నాడు ఎండు భూములతో ఉన్న సిరిసిల్ల.. నేడు ఎటు చూసిన నిండిన జలాశయాలు, పంటపొలాలతో కళకళలాడుతున్నది. భూ గర్భజలాలు పెరిగాయి. నేతన్నల బతుకు చిత్రం మారింది. సిరిసిల్లలో కొత్త స్వరూపం కనిపిస్తున్నది.
గాడ్ ఆఫ్ తెలంగాణ కేసీఆర్.. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్. సిరిసిల్లలోని తెలంగాణ భవన్ పార్టీ కార్యాలయం కాదు.. ఒక దేవాల యం. ఒక కార్యకర్తగా గర్వపడుతు న్నా. కొన్ని పార్టీలు కార్యకర్తలను బానిసలుగా చూస్తాయి. బీఆర్ఎస్ మాత్రం కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నది. కార్యకర్తలంటే బీఆర్ఎస్కు నమ్మకం.. ధైర్యం. 1956లో ఆంధ్రాలో తెలంగాణను కలువడంతో నష్టాలు చూశాం. ప్రస్తుతం ఢిల్లీ పాలకులు వస్తున్నారు. మరోసారి తెలంగాణ ప్రజలు నష్టపోకుండా ఉండాలి. భవిష్యత్తు తరాలు బా గుండాలంటే కేసీఆర్ సీఎంగా ఉండాల్సిందే. కర్ణాటకలో కాంగ్రెస్ బియ్యం కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఛత్తీస్గఢ్లో రైతులకు బోనస్ ఇస్తానన్న ఇవ్వడంలేదు. కేసీఆర్ను కాపాడుకుందాం. బీఆర్ఎస్లో నేను ఉండడం నా అదృష్టం.
బీఆర్ఎస్పై ప్రజలకు విశ్వాసం ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుంది. రాజకీయ పార్టీలకు సొంత భవనాలు నిర్మించుకోవడం గర్వకారణం. అధికారంలోకి రాకుముందే తెలంగాణ భవన్ నిర్మించుకొన్న ఘనత సీఎం కేసీఆర్ది. 2005లో పునాది వేసి, హైదరాబాద్లో తెలంగాణభవన్ కట్టుకున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లాకో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. కేసీఆర్ బీమాతో ఇంటింటికీ ధీమా కలుగుతుంది. 70ఏండ్లలో అప్పటి పాలకులు ఒక్క ఎస్సారెస్పీ జలాశయం నిర్మిస్తే, తొమ్మిదేండ్లలో ఆరు ప్రాజెక్టులు నిర్మించిన ఘన కేసీఆర్దే. ప్రజలంతా బీఆర్ఎస్కు పట్టం కట్టాలి.
సీఎం కేసీఆర్ రుణం తీర్చుకునే తరుణం ఇదే. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. పోరాటంతో సాధించిన తెలంగాణను గొప్ప రాష్ట్రంగా కేసీఆర్ తీర్చిదిద్దారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాలనను చేరువ చేసి, కార్యకర్తలకు పార్టీ పరిపాలన భవనాలు నిర్మిస్తున్నారు. కేసీఆర్కు పాదాభివందనం. తెలంగాణ భవన్ను త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించిన మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు.
రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలి. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ దేశానికి రోల్మాడల్గా నిలిచింది. మ్యానిఫెస్టోను మానవీయ కోణంలో ఆలోచించి ప్రచారం చేయాలి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ఇచ్చిన హమీలన్నీ వంద శాతం అమలు అవుతున్నాయి.
2001లో తొలిసారిగా కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో.. అనే నినాదంతో నిధులు, నియామకాలు, నీళ్లు.. అనే విధానంలో గులాబీ జెండాతో పోరాటం చేసినం. ఈ ఉద్యమంలో కొట్ల గొంతుకలను ఏకం చేసిన పార్టీ బీఆర్ఎస్. ఈ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సూచిక.
ప్రజాక్షేత్రంలో నమ్మకమైన పార్టీగా బీఆర్ఎస్ స్థిరంగా ఉంది. శాశ్వతంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్లు ఏర్పాటు చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం లేదు. రానున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగుకానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 105సీట్లు గెలువబోతున్నాం. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రానున్న 45రోజులు కష్టపడండి.
దేశంలోనే సిరిసిల్లకు వన్నెతెచ్చింది కేటీఆరే. సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ పార్టీ శాశ్వత రాజకీయ పార్టీగా ఎదిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణలో జీవన ప్రమాణాలు పెరిగాయి. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పూరించిన శంఖారావంతో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.