Siricilla : సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ పరిధిలో ఇటీవల విడుదల చేసిన ఓటర్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆయా మున్సిపల్ కమిషనర్లు దృష్టికి తీసుకురావాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్ (Garima Agarwal) సూచించారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇంటి నంబర్ల ప్రతిపాదికన మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డుపైన ప్రచురించామని ఆమె పేర్కొన్నారు.
ఎవరికైనా తమ ఓటు తమ ఇంటి నంబర్కు అనుగుణంగా కాకుండా వేరే వార్డులో నమోదైతే తమ ఆక్షేపణలను జనవరి 9వ తేదీలోగా లిఖిత పూర్వకంగా ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ లలో ఫిర్యాదు చేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు. ఆయా వార్డులకు సంబంధించిన ఓటర్ జాబితా అక్కడ అందుబాటులో ఉంటుందని గరిమ అగ్రవాల్ తెలిపారు.