Nampally Temple | రాజన్న సిరిసిల్ల : రాజన్న ఆలయ దత్తత దేవాలయం నాంపల్లి లక్ష్మీ నరసింహ స్వామి (Nampally Laxmi Narasimhaswamy)ని భక్తులు సులువుగా దర్శించుకొనేందుకు ఓ భక్తుడు కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు.
మంచిర్యాలకు చెందిన తుమీకి ప్రభాకర్ రాజు జ్ఞాపకార్థం.. ఆయన తనయుడు నవీన్ చందర్ రాజు దంపతులు ఈ మేరకు ఎమ్మెల్యే రమేశ్బాబును కలిశారు. నాంపల్లి గుట్ట అభివృద్ధి వీటీడీఏ ఏ ద్వారా చేపట్టనున్న నేపథ్యంలో లిఫ్ట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రమేశ్ బాబును కోరగా అందుకు స్పందించినందుకు అధ్యాపకుడు హర్షం వ్యక్తం చేశారు.
తనవంతుగా భక్తుల సౌకర్యం కోసం గుట్టపైకి లిఫ్ట్ ఏర్పాటుకు కోటి రూపాయల విరాళం ప్రకటిస్తున్నట్లు ఆయన వివరించాడు. హైదరాబాద్ లో ప్రభుత్వ కళాశాల అధ్యాపకులుగా తుమీకి నవీన్ చందర్ రాజు విధులను నిర్వహిస్తున్నారు.