సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల ర్యాలీలతో ప్రతి ఊరూ నుంచి స్వచ్ఛందంగా బయలుదేరారు. జై కేసీఆర్.. జై కేటీఆర్.. అంటూ నినదిస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. గ్రామాల నుంచి వచ్చే ప్రతీ వాహనం సీఎం కేసీఆర్ సభకే వెళ్లడంతో కార్మిక క్షేత్రం గులాబీమయమైంది.
గంభీరావుపేట మండలంలోని ఆయా గ్రామాల నుం చి బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామి గౌడ్, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఆధ్వ ర్యంలో 125 ఆర్టీసీ బస్సులు, 110ఆటోలు, 70ప్రైవేట్ వాహనాల్లో పార్టీ శ్రేణులు, అన్నివర్గాల ప్రజలు సీఎం సభకు తరలివెళ్లారు. మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్పంతులు పటాకులు కాల్చి, స్వయాన ఆటో నడపుతూ ర్యాలీ ద్వారా సభకు చేరుకున్నారు.
lముస్తాబాద్ మండలం కేంద్రంతోపాటు పలు గ్రామా ల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అన్నివర్గాల ప్రజలు ప్రత్యేక వాహనాల్లో సుమారు 13వేల మంది తర లివెళ్లారు. ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావులు, సిగింల్ విండో చైర్మన్ తన్నీరు బాపు రావు, సీనియర్ నేత శ్రీనివాస్రావు, పలువురు నాయకు లు పెద్దఎత్తున జనసమీ కరణ చేపట్టారు.
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలకు సోమవారం ఉదయం నుంచే బస్సులు చేరు కోవడంతో సందడి నెలకొన్నది. బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు వర్స కృష్ణహరి, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున సీఎం కేసీఆర్ ప్రజాశీర్వాద సభకు బయలుదేరారు.
వీర్నపల్లి మండలం నుంచి జడ్పీటీసీ గుగులోత్ కళా వతి, ఎంపీపీ మాలోత్ భూల, బీఆర్ఎస్ మండలాధ్యక్షు డు గుజ్జుల రాజిరెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ ఎడ్ల సాగర్, బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేశ్నాయక్ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి నాయకులు సీఎం సభకు తరలివెళ్లారు. మండల కేంద్రంలో వాహనాల ర్యాలీని వారు ప్రారంభించారు.
కోనరావుపేట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు నాయకులు పెద్దఎత్తున తరలివెళ్లారు. జై కేసీఆర్, జై కేటీఆర్, జై చల్మెడ అంటూ.. నినదిస్తూ సభ ప్రాంగణానికి సుమారు 1500మంది బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో వెళ్లారు.
జడ్పీటీసీ మ్యాకల రవి, ఎంపీపీ బూర వజ్రమ్మ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఊరడి ప్రవీణ్, గొస్కుల రవి ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ మండలం నుంచి సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభకు బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. వేములవాడ, వేములవాడ రూరల్ మండలం నుంచి బైక్లపై భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.
తంగళ్లపల్లి మండలం నుంచి ప్రజలు భారీగా తరలివెళ్లారు. 30 గ్రామాల్లోంచి సుమారు 15 వేల మంది తరలివెళ్లారు. 153 బస్సులలో జోరుగా..హుషారుగా సభకు నినాదాలు చేస్తూ తరలివెళ్లారు. ఇందిరమ్మ కాలనీలో 800 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. సర్పంచ్ బైరి శ్రీవాణి -రమేశ్ దంపతుల ఆధ్వర్యంలో బతుకమ్మలు, బోనాలతో మహిళలు ర్యాలీ తీశారు.