రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని విర్నపల్లి మండలం శాంతి నగర్ గ్రామానికి చెందిన అజ్మీరా చిట్టి అనే గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండటంతో కుటుంబ సంభ్యులు 108 కి కాల్ చేశారు. వెంటనే స్పందించిన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గర్భిణిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. వారిని సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో చేర్చించారు.