రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయం వద్ద 28 రోజుల వయసుగల బాబును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ పట్టణంలోని శాంతినగర్ చెందిన లావణ్య ఇద్దరు కుమారులతో కలిసి గత నాలుగు రోజులుగా ఆలయం మెట్ల వద్ద ఒంటరిగా ఉంటున్నది. ఆదివారం రాత్రి లావణ్యకు మద్యం తాగించి వేకువజామున దుండగులు అపహరించినట్లు గా సమాచారం. బాధితురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.