Vemulawada kode | వేములవాడ, జూన్ 1 : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించిన కోడెలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. రైతులు తప్పనిసరిగా పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డుతో అధికారులు సూచించిన https://rajannasircilla.telangana.gov.in/ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా .
ఆదివారం నుండి కోడెలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇప్పటికే ప్రకటన విడుదల చేశారు. మొదటి విడతలో 300 కోడెలను చిన్నవాటిని పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. జియో ట్యాగింగ్ కలిగి ఉన్న వాటిని రైతులకు అందజేస్తామన్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. ఇక రాజన్న ఆలయ గోశాలలో ప్రస్తుతం 1250 పైగా కోడెలు ఉండగా ఇకపై పంపిణీ పకడ్బందీగా పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Rajanna Kodelu | వేములవాడ రాజన్న కోడెలకు దరఖాస్తులు..
Mallapur | మల్లాపూర్లో విషాదం.. ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య
Housefull 5 | ఒకే సినిమాకు రెండు క్లైమాక్స్లు.. ‘హౌస్ఫుల్ 5’ కొత్త ప్రయోగం!