రాజన్న సిరిసిల్ల : ఏ కష్టమెచ్చిందో ఏమో తెలియదు కాని చావే శరణ్యమని భావించిన ఓ వ్యక్తి మానేరు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రంలో చోటు చేసుసుకుంది.
విద్యానగర్కు చెందిన రమణ అనే వ్యక్తి బుధవారం మానేరు వంతెన పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు 108 వాహనంలో దవాఖానకు తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.