జ్యోతినగర్ (రామగుండం) : రామగుండం రైల్వేస్టేషన్లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలని, స్టేషన్ ఆవరణలో పార్కింగ్ షెడ్ నిర్మాణం, ఆటోలకు అనుమతి, పెద్దంపేటలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ జీఎంకు వినతి పత్రం అందజేశారు. రామగుండం రైల్వేస్టేషన్ పర్యటనకు వచ్చిన ఆయన్ను కలిసి సమస్యలను విన్నవించారు.
ప్యాసింజర్ రైళ్లు ఆపకపోవడంతో పెద్దంపేట స్టేషన్ చుట్టు పక్కల 14 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే హాల్టింగ్ ఇవ్వాలన్నారు. పెద్దంపేట రైల్వేగేట్ పడ్డ ప్రతిసారి గంటకుపైగా ప్రయాణాలు ఆగిపోతున్నాయని వెంటనే ఆర్వోబీ నిర్మించాలని కోరారు. రైల్వేస్టేషన్ చివర మంచిర్యాల వైపు రైల్వే బ్రిడ్జి కింద రైల్వే వంతెన తరహాలో అండర్ పాస్ బ్రిడ్జి నిర్మించాలన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్రెడ్డి, 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీశ్కుమార్ ఉన్నారు.