కరీంనగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ నడిబొడ్డున స్మార్ట్ సిటీ నిధులు రూ. 12 కోట్లతో ఆధునిక సౌకర్యాలు, సకల హంగులతో ఆర్ అండ్ బీ అతిథి గృహం నిర్మించారు.
దీనికి కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్హౌస్ (కేసీఆర్) అని నామకరణం చేశారు. పనులు పూర్తి కాగా అధికారులు ప్రారంభానికి సిద్ధం చేశారు.