చొప్పదండి, జూన్ 19: తెలంగాణ రాష్ట్రాన్ని హరితమయంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య-వినయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం చొప్పదండిలోని 6వ వార్డులో, గుమ్లాపూర్ ఎక్స్రోడ్డు వద్ద, రేవెల్లి, దేశాయ్పేట, చిట్యాలపల్లి గ్రామాల్లో నిర్వహించిన హరితోత్సవంలో వారు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ర్టాన్ని హరితమయంగా మార్చాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం ప్రవేశపెట్టారని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషితోనే వర్షాలు సకాలంలో కురుసి నీటి సమస్య తీరిందన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు మొక్కలు నాటారు. కార్యక్రమంలో కౌన్సిలర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు వడ్లూరి గంగరాజు, మున్సిపల్ వైస్చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కమిషనర్ శాంతికుమార్, తహసీల్దార్ రజిత, ఎంపీడీవో స్వరూప, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్, మాడూరి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్రెడ్డి, సర్పంచులు తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్గౌడ్, కొత్తూరి లింగమ్మ, గుంట రవి, సురేశ్, నాయకులు చేగంటి రవి, కొత్తూరి నరేశ్, దండె కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 19: మండలంలోని 33 గ్రామాల్లో హరితోత్సవంలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, విద్యార్థులు విరివిగా మొక్కలు నాటారు. గ్రామాల్లో నర్సరీలను పరిశీలించి గ్రామస్తులకు మొక్కలు అందజేశారు. నర్సరీల వద్ద తెలంగాణ హరితహారం పేరుతో ముగ్గులు వేసి అందంగా అలంకరించారు. నర్సరీల్లో మొక్కలను సంరక్షిస్తున్న వన సేవకులను సన్మానించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు, నాయకులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, ఉపాధిహామీ సిబ్బంది, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గంగాధర, జూన్ 19: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎస్ఐ అభిలాష్ కోరారు. గంగాధర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రజలు మొక్కలు నాటి సంరక్షిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
రామడుగు, జూన్ 19: హరితహారం కార్యక్రమం పల్లెల రూపురేఖలనే మార్చివేసిందని ఎంపీపీ కలిగేటి కవిత పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మోడల్స్కూల్ ఆవరణలో సర్పంచ్ పంజాల ప్రమీల-జగన్మోహన్గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితోత్సవం కార్యక్రమానికి ఎంపీపీ కలిగేటి కవిత హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, అంతరించిపోతున్న అడవుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మోడల్స్కూల్ పరిసరాల్లో డ్రాగన్ మొక్కలు నాటారు. వెలిచాలలో సర్పంచ్ వీర్ల సరోజన అధికారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ పంజాల ప్రమీల-జగన్మోహన్ గౌడ్, వైస్ ఎంపీపీ పూరెల్ల గోపాల్గౌడ్, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, ఎంపీడీవో భాస్కర్రావు, ఎంపీవో రాజశేఖర్రెడ్డి, ఏపీవో రాధ, మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ వనజ, ఉపాధిహామీ కూలీలు, వెలిచాలలో ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్రావు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.