Velgatur | వెల్గటూర్, ఫిబ్రవరి 1 : పరిపాలన చాతకాక, ప్రజల ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేసి శునకానందం పొందాల చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చేపుతారని ఏఎంసీ మాజీ చైర్మన్ పత్తిపాక వెంకటేశ్, బీఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండల అద్యక్షులు సింహాచలం జగన్ అన్నారు.
ఆదివారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ వెల్గటూర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి ప్రేకీ తగలబెట్టే ప్రజత్నం. చేయగా పోలీసులు అడ్డుకోగా రోడ్డుపై దర్నా చేశారు. ఎండపల్లి మండల రాజారాంపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు.
ఈ కార్యక్రమ బీఆర్ఎస్ పార్టీ వెల్గటూర్ మండల అధ్యక్షులు చల్లూరి రాంచందర్ గౌడ్, సర్పంచ్లు పర్ష కోటయ్య, ద్యావనపల్లి సుధాకర్, గాదం భాష్కర్, మాజీ సర్పంచ్లు మారం జలేందర్రెడ్డి, కొప్పుల విద్యాసాగర్, అనుమాల తిరుపతి, కారుకూరి సత్తయ్య, కుంటాల రాజు, మేర్గు కొండయ్య, మాజీ ఎంపీటీసీ గాజుల మల్లేశం, నాయకులు మూగల సత్యం, కొప్పుల సురే?, కుమ్మరి వెంకటేశ్, రామిళ్ళ సనిల్, అల్గునూరి సతీశ్, మేర్గు జానీ, బోగ రాజయ్య, ఉప్పు రాజయ్య, పడిదం నారాయణ, పడిదం వెంకటేశ్, తిరుపతి, మహేందర్, రాజేశం, బిడారి తిరుపతి, రంగు తిరుపతి, సంకోజు తిరుమల్, శ్రీదర్, సుధాకర్రావు, రాజయ్య, గౌరి తిరుపతి, మహేశ్, సాగర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.