Godavari Pushkara Arrangements | పెద్దపల్లి, మార్చి2: గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో చేయాల్సిన ఏర్పాట్ల ఫైనల్ ప్రతిపాదనలు ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టరేట్లో 2027 గోదావరి నది పుష్కరాల ఏర్పాట్ల పై రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు గోదావరి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా పుష్కరాలు జరుగుతాయని, దీనికి సంబంధించి జిల్లాలో భక్తులు పుణ్యన్నానాలు అరించేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం చేయాలని, రోడ్డు విస్తరణ, లైటింగ్, పార్కింగ్, ఆలయాల వద్ద అభివృద్ధి, తదితర అంశాలపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
గోలివాడ, మంథని, గోదావరిఖని, సుందిళ్ల వంటి ప్రాంతాలలో గోదావరి నది ప్రవాహం ఉంటుందని అక్కడ చేయాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో డీసీపీ రాంరెడ్డి, ఆర్అండ్ బీ ఈఈ భావ్ సింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.