విద్యానగర్, జనవరి 18: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్ష్మీనారాయణ 24 సంవత్సరాలుగా కాకతీయ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్ విభాగంలో హెచ్వోడీగా పని చేస్తున్నారు.
ఆయనకు ప్రిన్సిపాల్గా పదోన్నతి కల్పిస్తూ కరీంనగర్ మెడికల్ కళాశాలకు బదిలీ చేశారు. ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణకు ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ఇన్చార్జి ఆర్ఎంవో నవీన, ఏవో నజీముల్లాఖాన్, వైద్యులు పద్మ, శ్రీనివాస్, నరేందర్, అలీం, మంజుల, రవిప్రవీణ్, ఆఫీస్ సూపరింటెండెంట్ పుల్లెల సుధీర్, సీనియర్ అనాలిస్టు రవీందర్ అభినందనలు తెలిపారు.