Dharmaram | ధర్మారం, జులై 6 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ)పాఠశాలను సోమవారం మండల విద్యాధికారి పోతు ప్రభాకర్ ప్రారంభించారు. ప్రీ -ప్రైమరి చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రీ -ప్రైమరీ పాఠశాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకొని తమ పిల్లలను ఈ పాఠశాలకు పంపించాలని ఆయన సూచించారు.
పాఠశాలలో విద్యార్థులకు గుణత్మాక విద్యను అందించే విషయంలో ప్రతీ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్న సామర్థ్య్యాలపై ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా బోధిస్తున్న పాఠశాల హెడ్మాస్టర ఎన్ మోతిలాల్ నాయక్ ను, ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కటికనపల్లి స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ పెద్ది వెంటేశ్వర్లు, సర్పంచ్ చేపూరి లచ్చయ్య, వార్డు సభ్యురాలు తాళ్లపెల్లి హేమలత, ఉపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, వెంకటరమణరెడ్డి, విద్యా వాలంటీర్ బీ సంధ్య, సీఆర్పీ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.