Thimmapur | తిమ్మాపూర్,డిసెంబర్28: తిమ్మాపూర్ మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాని ఆదివారం మండల సర్పంచుల ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా మన్నెంపల్లి సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
గౌరవ అధ్యక్షుడిగా తాట్ల తిరుపతి, గౌరవ సలహాదారురాలిగా సురం స్వప్న మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా మామిడి మమతా సతీష్, కనకం లక్ష్మి కొమురయ్య, ప్రధాన కార్యదర్శిగా ఆవుదుర్తి రామకిషన్, కోశాధికారిగా గోదరి శోభారాణి రవి, కార్యదర్శిగా పిస్క సౌజన్య కృష్ణ కిషోర్, దుర్గం శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలుక ఆంజనేయులు, గుజ్జుల శ్వేత ప్రణీత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.