సుల్తానాబాద్ రూరల్, జనవరి 20 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల-వేగురుపల్లి గ్రామాల పరిధిలోని రంగనాయక స్వామి దేవాలయం ఆవరణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర చైర్మన్ గా నీరుకుల్ల గ్రామానికి చెందిన పొన్నం చంద్రయ్య గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. జాతర కమిటీ సభ్యులుగా నేరెళ్ల రాజయ్య, అడ్డగుంట శ్రీనివాస్, కోమల, ప్రశాంత్, సిరిసిల్ల కళావతిని నియమిస్తూ నియామక పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ గా నియమించినందుకు ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు పొన్నం చంద్రయ్య గౌడ్, సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 28, 29, 30 మూడు రోజుల పాటు నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని నూతన చైర్మన్ చంద్రయ్య గౌడ్ తో పాటు కమిటీ సభ్యులు తెలిపారు.