Ganneruvaram | గన్నేరువరం, సెప్టెంబర్ 1 : సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా మండలంలోని పారువెల్ల గ్రామానికి చెందిన పిట్టల రాములు నియామకమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర అధ్యక్షుడు ఏలిగండ్ల వెంకటేష్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన నియోజకవర్గ ఇన్చార్జ్ పిట్టల రాములు మాట్లాడారు. తనపై నమ్మకంతో తనను నియమించినందుకు జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎలిగేండ్ల వెంకటేష్కు కృతజ్ఞతలు తెలిపారు.