NandiMedaram | ధర్మారం, ఫిబ్రవరి 5 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం జూనియర్ సివిల్ కోర్టు శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు జిల్లా జడ్జి సునీత పేర్కొన్నారు. గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల విద్యాలయం ఎదుట ఉన్న ఎస్సీ కాలనీలోని కమ్యూనిటీ హాల్ భవనం ఎదురుగా ఉన్న స్థలంతోపాటు శ్రీ అమరేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న స్థలాన్ని జడ్జి సునీత గురువారం పరిశీలించారు.
ఈ రెండింటిలో ఏ స్థలం కోర్టు భవన నిర్మాణానికి అనువుగా ఉంటుందో సర్వే చేసి కేటాయించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నంది మేడారం సివిల్ కోర్టు జడ్జి ఎం సరిత, తహసీల్దార్ డీ శ్రీనివాస్, ఆర్ఐ నవీన్ రావు, సర్వేయర్ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, న్యాయవాదులు బొట్ల లక్ష్మీ నర్సయ్య, ఆకారి రాజేశం, భీమారపు సంపత్ తదితరులు పాల్గొన్నారు.