కొత్తపల్లి, జూన్ 20: కేసీఆర్ సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ విద్యా రంగంలో దే శంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని చాటేందుకే ప్రభుత్వం 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వ హిస్తుందని చెప్పారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన విద్యాదినోత్సవానికి మంత్రి గంగుల, సుడా చైర్మన్ జీవీఆర్, మాజీ ఎమ్మెల్సీ నా రదాసు, కలెక్టర్ ఆర్వీకర్ణన్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైబ్రరీలో నూతన భవనాన్ని ప్రారంభించారు. రాంనగర్లో మహిళా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మా ట్లాడారు. ప్రభుత్వం చేసిన పనులను వివరిస్తూనే ప్రతిపక్షాలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. విద్యార్థుల ఉజ్వల భవిత కోసమే కేసీఆర్ తెలంగాణను సాధించారని చెప్పారు. ప్రభుత్వం స్వరాష్ట్రంలో సకల హంగులతో గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకే మన ఊరు-మన బడి కింద స్కూళ్లను పునరుద్ధర ణకు నడుంబిగించిందని వివరించారు. సమై క్య పాలనలో గ్రంథాలయాలకు పక్కా భవనాలు లేక, కనీస వసతుల్లేక కునారిల్లాయని, కనీసం న్యూస్ పేపర్కు సైతం నో చుకోలేదని చెప్పారు. జి ల్లా గ్రంథాలయం అన్ని హంగులతో రూపుదిద్దుకొ ని రాష్ర్టానికే మోడల్గా మారడం సంతోషంగా ఉన్నదన్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువత కో సం ఏసీ సౌకర్యం కల్పించామని, వారధి సహకారంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని పేర్కొన్నారు. అభ్యర్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. ఇక్కడ పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు ఐఏఎస్, ఐ పీఎస్ సాధించాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అక్షరాస్యతలో కేరళ రాష్ట్రంతో తెలంగాణ పోటీపడుతుందని చెప్పారు.
వృత్తిదారులకు రూ. లక్ష సాయం నిరంతర ప్రక్రి య అని మంత్రి ప్రకటించారు. లబ్ధిదారులకు ప్రతినెలా 15న చెక్కులు అందజేస్తామని చెప్పారు. కులవృత్తులను కా పాడేందుకు సీఎం కేసీఆర్ ఈ బృహత్తర పథకానికి అంకురార్పణ చేశారని తెలిపారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులకు తెలంగాణ అభివృద్ధి గు ర్తుకు వస్తుం దని విమర్శించారు. బీఆర్ఎస్కు 60 శాతం ఓటు బ్యాంకు ఉన్నదన్నారు. మిగిలిన 40 శాతం ఓట్లను ఆ రెండు పార్టీలు పంచుకుంటాయని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారం తోనే కరీంనగర్ను రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో గొప్ప నగరంగా తీర్చిది ద్దుకున్నామని స్పష్టం చేశారు. కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ హైదరా బాద్ తరువాత కరీంనగర్ గ్రంథాలయంలోనే 24 గంటల పాటు చదువుకొనేందుకు నిరుద్యోగులు, పాఠకులకు అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. త్వరలోనే రూ. 7 కోట్ల స్మార్సిటీ నిధులతో ఐదు ఫ్లోర్లతో అధునాతన భవన నిర్మాణ పనులు ప్రా రంభిస్తామన్నారు. నిరుద్యోగులు వారధి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రం థాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి, కరీం నగర్ ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు, గ్రంథాలయ కార్యదర్శి సరిత పాల్గొన్నారు.
కమాన్చౌరస్తా, జూన్ 20: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆరెపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదులు, అభివృద్ధి పనులు, విద్యార్థులకు రాగి జావ పంపిణీని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, గత 9 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని తెలిపేందుకే సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను ఘ నంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. విద్య జగత్తుకు మూలమని, విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుందన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత స్థా యికి ఎదగాలని సూచించారు. పేద వి ద్యార్థులు చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కార్పొరేట్కు దీటుగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులతో విద్యా బోధన చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాలను విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా క్రోమ్ బుక్స్ పంపిణీ చేశారు.
శాతవాహన విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల లో విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వి ద్యార్థులకు ఉపన్యాస, పాటలు, రంగవల్లుల పో టీ లు నిర్వహించారు. విజేతలకు ప్రిన్సిపాల్ జ యం తి బహుమతులు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, బంగారు తెలంగాణ ఏర్పాటు లో విద్యారంగం పాత్ర ఎనలేనిదన్నా రు. విద్యార్థు లు కష్టపడి చదివి బంగారు తెలంగాణకు బాటలు వేయాలన్నారు. విశ్వవిద్యాలయంలోని వసతులను వినియోగించుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని ఆ కాంక్షించారు. రసాయనశాస్త్ర విభాగాధిపతి నమ్ర త, అదనపు కంట్రోలర్ సరసిజా పాల్గొన్నారు.