పెద్దపల్లి, నవంబర్ 2: జగిత్యాలలో ఈ నెల 7న జరిగే సీఎం కేసీఆర్ బహిరంగసభకు విజయవంతం కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సూచించారు. శుక్రవారం పెద్దపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. టీ(బీ)ఆర్ఎస్ ముఖ్య నాయకులు, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అన్ని గ్రామాల నుంచి రైతులు, మహిళలు, కార్యకర్తలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి 10 వేల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. సమన్వయంతో ముందుకెళ్లి సభ సక్సెస్ కోసం కృషి చేయాలని కోరారు.