తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్మారక స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించుకున్నారు. జడ్పీ, మున్సిపల్, పంచాయతీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులను సన్మానించారు. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. వారి ప్రాణత్యాగంతోనే స్వరాష్ట్ర కల సాకారమైందని గుర్తు చేశారు. కాగా, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మండలి చీఫ్విప్ తానిపర్తి భానుప్రసాదరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీత సత్యనారాయణ, రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొని అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
– పెద్దపల్లి, జూన్ 22 (నమస్తే తెలంగాణ)
పెద్దపల్లి, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం అమరులకు జిల్లా ప్రజలు ఘన నివాళులర్పించారు. పల్లె, పట్టణాల్లో తెలంగాణ అమర వీరుల స్తూపాలను ముందు రోజే పూలతో అందంగా అలంకరించారు. గురువారం ఉద యం అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యమ కారులు, జేఏసీ సం ఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎ త్తున స్తూపాల వద్దకు చేరుకుని పూలు చల్లి నివాళులర్పించారు. ‘తెలంగాణ అమరులకు జోహార్’ అంటూ నినదించారు. జిల్లా పరిషత్, మున్సిపల్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, అమరవీరుల సంస్మరణ తీర్మానం ప్రవేశపెట్టారు. అమరుల కుటుంబ సభ్యులను సన్మానించి, భావోద్వేగానికి లోనయ్యారు. వారి ప్రాణత్యాగాలు వెలకట్టలేనివని, అమరుల త్యా గం వల్లే స్వరాష్ట్రం సాకారమైందని స్పష్టం చేశారు. కాగా, పెద్దపల్లిలోని అమరుల స్తూపం వద్ద మండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ సర్వే సంగీతా సత్యనారాయణ నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
అమరుల కుటుంబసభ్యులను ఘనంగా సన్మానించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారితో కలిసి అల్పాహారం స్వీకరించారు. సుల్తానాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద అమరవీరుల స్తూపం నిర్మాణానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి భూమి పూజ చేశారు. అంతకు ముందు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అమరవీరుల కుటుంబాలతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం ర్యాలీగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు చేరుకొని స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబ సభ్యులను సన్మానించి, మొక్కలను అందజేశారు. ఉద్యమంలో అసువులు బాసిన బిడ్డలకు గుర్తుగా ఇంటి వద్ద ఈ మొక్కను నాటి పెంచాలని కోరారు. మంథని పట్టణంలోని బొకలవాగుపై కొత్తగా నిర్మించిన వంతెనపై అమరవీరుల స్మారక స్తూప నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, ఆదనపు కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ భూమి పూజ చేశారు. పలువురు ఉద్యమకారులను శాలువాతో సన్మానించారు.