పెద్దపల్లి టౌన్, నవంబర్ 28: ఆటోలకు రవాణా పన్ను, ఫిట్నెస్ టాక్స్ను తొలగించి, గ్రీన్ టాక్స్ చార్జిలను తగ్గించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ గార్డెన్స్లో ఆటో, లారీ డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సకల జనుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. తమ పై ఓ కుటుంబం ఆధారపడి ఉందని గ్రహించి డ్రైవింగ్ చేయాలని, ప్రతి డ్రైవర్ బాధ్యతతో మెలగాలని సూచించారు. ఆటో డ్రైవర్లు సామాజిక బాధ్యత మెలగాలని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి దగ్గరిలోని దవాఖానకు తరలించాలని కోరారు. రవాణా శాఖ, ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు జరుగకుండా డ్రైవర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి ఐఎంఏ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచితంగా కంటి పరీక్షలు, అవసరమై వారికి కంటి అద్దాలు అందజేయడం అభినందనీయమన్నారు. తపాలా శాఖ, రవాణా శాఖ, పోలీసులు అధికారులు అవగాహన సదస్సు పెట్టి ట్రాఫిక్ నిబంధనలు, కుటుంబాలకు జరుగుతున్న నష్టాలను వివరించడం సంతోషంగా ఉందన్నారు. తపాలా శాఖలో రూ.258, రూ.399తో ఇన్సూరెన్స్ చేయించుకుంటే కుటుంబం పొందే సౌకర్యాలను వివరించారు. ఇన్సూరెన్స్ లేని ఆటో డ్రైవర్లు సొంత డబ్బుతో ఫోస్టాఫీస్లో ఖాతా తెరిస్తే రూ.258 ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ రూపేశ్, ఆర్టీఏ రంగచారి, ఏసీపీ సా రంగపాణి, సీఐలు ప్రదీప్కుమార్, ఇం ద్రసేనా రెడ్డి. ట్రాఫీక్ సీఐ బర్ల అనిల్ కుమార్, ఏవీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రాజేశ్, ఉపేందర్ రావు, మ హేందర్, శ్రీనివాస్, రాజ్వర్దన్, సహదేవ్ సింగ్, శివాజి రెడ్డి, సరితా, అశోక్రెడ్డి, వెంకటకృష్ణ, డాక్టర్లు ప్రణీత్, రమాకాంత్, స్వరూప్ కిరణ్ గౌడ్, విజయశ్రీ, లేబర్ అధికారి రాంమోహన్, ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.