జూలపల్లి,జూన్ 27: మహిళల అభ్యు న్నతి, సాధికారతే లక్ష్యంగా ఎస్బీఐ గ్రా మీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ-జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జూలపల్లిలో ‘ఉన్నతి’ శిక్షణ మొ దలైంది. జూలపల్లిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం గ్రామీణ ఉపాధి హామీ మహిళ కూలీలకు శిక్షణ తరగతులను ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి, జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ మాట్లాడారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదిగి కుటుంబాన్ని చక్కదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. ఇంటి వద్ద సమయాన్ని వృథా చేయకుండా వివిధ రకాల వస్తువులు అందంగా తయారు చేసి అధిక ఆదాయాలు పొంది ఆదర్శంగా నిలవాలని సూచించారు.
వంద రోజులు ఈజీఎస్ పనులు పూర్తి చేసిన కుటుంబాల నుంచి 35 మందిని ఎంపిక చేశామని, వివిధ అంశాల్లో 13 రోజుల శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ కాలంలో రోజూ రూ. 272 కూలీగా వేతనం చెల్లిస్తారని వెల్లడించారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్బీఐ-గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్థిక తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ వైస్ ఎంపీపీ మొగురం రమేశ్, అబ్భాపూర్ ఎంపీటీసీ సభ్యుడు దండె వెంకటేశం, ఎంపీడీవో వేణుగోపాల్రావు, ఏపీడీ సత్యనారాయణ, ఎస్బీఐ ఆర్సెట్ డైరెక్టర్ సంపత్కుమార్, జేడీఎం శ్రీనివాస్రావు, ఏపీవో సదానందం, ట్రైనర్లు రవి, సుష్మ పాల్గొన్నారు.