Ramagundam Mayor : యుద్ద ప్రాతిపదికన కాలువల్లోని పూడిక తొలగించి వరద ముప్పు నివారించడానికి చర్యలు తీసుకుంటున్నామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమంలో భాగంగా శనివారం ఒకటవ డివిజన్లో డిప్యూటీ మేయర్ పాత పెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ), కమిషనర్ జె, అరుణ శ్రీతో కలిసి ఆయన పర్యటించారు.
ఈ సందర్భంగా పి కె. రామయ్య కాలనీ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించిన మేయర్ కాలువల్లో పూడికతీతకు ఆదేశించారు. జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, చైన్ జేసీబీ, బాబ్ కార్ట్, జెట్టింగ్ యంత్రం, పారిశుద్ధ్య సిబ్బంది సహాయంతో కాలనీ వీధుల్లో పూడుక పోయిన ఉపరితల కాలువను పూర్తిగా శుభ్రం చేయించారు.
పి కె. రామయ్య కాలనీలోని కాలువ చుట్టురా, లోపలా పేరుకుపోయిన తుప్పలు, పొదలు, పిచ్చి మొక్కలను తొలగించారు. వీధుల్లో నడవడానికి వీల్లేకుండా రోడ్డు మీదకు అడ్డుగా వచ్చిన చెట్ల కొమ్మలను బ్లేడ్ యంత్రం సహాయంతో తొలగించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వెంగళ బాపు, నగర పాలక సంస్థ ఎస్ ఈ గురువీర, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఏఈ తేజస్విని, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్, సీనియర్ అకౌంటెంట్ రాజ్ కుమార్, జవాన్ సూర్య, నగర పాలక సంస్థ సిబ్బంది, మెప్మా ఆర్పీలు పాల్గొన్నారు.