పెద్దపెల్లి : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధి బండారి కుంటకు చెందిన బరియల కావ్య (20) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.