పెద్దపల్లి: జిల్లాలోని మంథని వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. మండలంలో గోదావరి తీరం వెంబడి ఉన్న పొలాల్లోకి వరద నీరు భారీగా చేరింది. ప్రాచీన గౌతమేశ్వరస్వామి దేవాలయం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఆలయంలో 28 మంది చిక్కుకుపోయారు. ఇందులో ఆలయ పూజారి సహా 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. చేపల వేటకు వెళ్లిన ఇద్దరు మత్య్సకారులు, నిన్న రాత్రి ఆలయంలో నిద్ర చేయడానికి వచ్చిన మరో 8 మంది ఉన్నారు. వారిని రక్షించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, మంథనిలో గత మూడు రోజులుగా కురుస్తున్న వానలతో పోచమ్మ తల్లి ఆలయం నీట మునిగింది.