పెద్దపల్లి, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనతో పెద్దపల్లి జనసంద్రంగా కనిపించింది. సోమవారం ముఖ్యమంత్రి తొలుత గౌరెడ్డిపేట శివారులో నిర్మించిన టీఆర్ఎస్ జిల్లా కార్యాలయం, పెద్దబొంకూరు శివారులోని కల్వల క్యాంపులో నిర్మించిన కలెక్టరేట్ను ప్రారంభించారు. అనంతరం పెద్దకల్వల శివారులో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు సరిగ్గా సాయంత్రం 4.24 గంటలకు చేరుకున్నారు.
ఉమ్మడి జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లా నుంచి కూడా ప్రజలు లక్షకుపైగా తరలివచ్చారు. సీఎం వేదికపైకి వస్తున్న సమయంలో చప్పుట్లు ఈలలతో స్వాగతించారు. నిజానికి లక్ష మందికి సరిపోయేలా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినా.. దాదాపు లక్షా 30 వేల మంది వచ్చారు. సభకు వెళ్లేదారుల్లో వేలాది మంది ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయారు. ఒకవైపు కమ్ముకొచ్చిన మేఘాలు.. మరోవైపు చిరుజల్లుల మధ్య సీఎం 16 నిమిషాలపాటు ప్రసంగించగా, ప్రతి ఒక్కరూ ఆసక్తిగా విన్నారు.
ఆద్యంతం హర్షధ్వానాలు చేశారు. వరాల జల్లు కురిపించడంతో జేజేలు పలికారు. సీఎం రాకకు ముందు వేదికపై కళాకారులు ఆటపాటలతో ఉర్రూతలూగించారు. ప్రముఖ కళాకారుడు సాయిచంద్ పాడిన ‘జబ్బకు సంచీ.. చేతుల జెండా.. జాతర పోదమా..’ అనే పాటకు చేతిలో టీఆర్ఎస్ జెండాను పట్టుకొని చిందులేశారు. బండి సంజయ్ ఇటీవల అమిత్షా చెప్పులు మోసిన సందర్భాన్ని గుర్తుచేసేలా ‘గుజరాతోని చెప్పులు మోసిన.. బాంచెన్ బండి సంజయ్.. ఆత్మగౌరవ తెలంగాణలో ఇక నీకేం పని’ అని పాడిన పాటకు కార్యకర్తలు నృత్యం చేశారు.
నిజానికి లక్ష మందికి సరిపోయేలా సభా ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినా.. దాదాపు లక్షా 30వేల మంది వచ్చారు. సభకు వెళ్లేదారుల్లో వేలాది మంది ఎక్కడికక్కడే రోడ్లపై నిలిచిపోయారు. ఒకవైపు కమ్ముకొచ్చిన మేఘాలు.. మరోవైపు చిరుజల్లుల మధ్య సీఎం 16 నిమిషాలపాటు ప్రసంగించగా, ఆ ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా విన్నారు. ఆద్యంతం హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. వరాల జల్లు కురిపించడంతో జేజేలు పలికారు. సీఎం రాకకు ముందు వేదికపై కళాకారులు ఆటాపాటలతో ఉర్రూతలూగించారు. ప్రముఖ కళాకారుడు సాయిచంద్ పాడిన ‘జబ్బకు సంచీ.. చేతుల జెండా.. జాతర పోదమా..’ అనే పాటకు చేతిలో టీఆర్ఎస్ జెండాను పట్టుకొని చిందులేశారు. బండి సంజయ్ ఇటీవల అమిత్షా చెప్పులు మోసిన సందర్భాన్ని గుర్తుచేసేలా ‘గుజరాతోని చెప్పులు మోసిన.. బాంచెన్ బండి సంజయ్.. ఆత్మగౌరవ తెలంగాణలో ఇక నీకేం పని’ అని పాడిన పాటకు కార్యకర్తలు నృత్యం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మొగిళి రమేశ్ అలియాస్ జూనియర్ కేసీఆర్ జనానికి అభివాదం చేశారు. సభలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేకాకర్షణగా నిలిచారు. కార్యకర్తలు, ప్రజల మధ్యన జెండాను ఊపుతూ ఉత్సాహపరిచారు.