పెద్దపల్లి : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళిత అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సీఎం రాష్ట్ర సీఎం కేసీఆర్ అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో దళితబంధు యూనిట్లు పంపిణీ చేసి మాట్లాడారు.
రాష్ట్రంలోని దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న మహా సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేశారని అన్నారు. దళిత బందు పథకం అమలుతో కులీలుగా ఉన్న దళితులు ఓనర్లుగా మారారని అన్నారు. దళితులు ప్రతి రంగంలో ఉన్నతంగా ఎదుగాలన్నారు.
కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, మేకల సదానందం తదితరులు పాల్గొన్నారు.