కొత్తగూడెం సింగరేణి/ రామగిరి, మే 19: సింగరేణిలో బదిలీ వర్కర్ నుంచి వివిధ పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యూఏ అభ్యర్థులకు యాజమాన్యం తీపి కబురు అందించింది. సంస్థలో 155 క్లర్క్ పోస్టులను బదిలీ వర్కర్ మొదలు ఇతర పోస్టుల్లో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులతో భర్తీ చేయాలని ని ర్ణయించింది. సంస్థ చైర్మన్ శ్రీధర్ ఆదేశాల మేరకు డైరెక్టర్ (పా) బలరాం గురువారం నోటిఫికేషన్ను వి డుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. వివిధ గనులు, డిపార్ట్మెంట్లలో 155 క్లర్క్ పోస్టులను ఇంటర్నల్ అ భ్యర్థుల ద్వారా భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుం చి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 25 నుంచి జూన్ 25వ తేదీ దాకా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఈ దరఖాస్తుల హార్డ్ కాపీలను అభ్యర్థులు జూన్ 25వ తేదీలోగా పోస్టు ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. అండర్ గ్రౌండ్ ఉద్యోగులు ఏడాదిలో కనీసం 190 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. సర్ఫేస్ ఉద్యోగులైతే ఏడాదిలో 240 మస్టర్లు పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులు ఏ దైనా డిగ్రీని కనీస అర్హతగా కలిగి ఉండడంతో పాటు కంప్యూటర్ కోర్సుల్లో ఆరు నెలల సర్టిఫికెట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులకు వయోపరిమతి లేదు. రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి 95 శాతం పోస్టులను సింగరేణి విస్తరించిన నాటి నుంచి ఉమ్మడి 4 జిల్లాలకు చెందిన ఇన్ సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు. మిగిలిన 5 శాతం పోస్టులకు తెలం గాణ అన్ని జిల్లాల ఇన్సర్వీస్ అభ్యర్థులు అర్హుల వుతారని స్పష్టం చేశారు. రాత పరీక్షకు 85 శాతం, అసెస్మెంట్ రిపోర్టుకు 15 శాతం మార్కుల వెయి టేజ్ ఉంటుంది. ఇంటర్నల్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇది సువర్ణావకాశం..
సంస్థలో డిపెండెంట్, కారుణ్య నియామక ప్రక్రి య ద్వారా విద్యావంతులైన యువకులు బదిలీ వ ర్కర్, జనరల్ మజ్దూర్లు గా పనిచేస్తున్నారు. వీరి విద్యార్హతలు, ప్రతిభను బట్టి మెరుగైన ఉద్యోగాలు కల్పించేందుకు సీఎండీ శ్రీధర్ సంకల్పించారు. ఈ మేరకు తొలి విడుతగా 155 క్లర్కు పోస్టులను ఇన్ సర్వీస్ అభ్యర్థులతో భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇదో సువర్ణావకాశంగా భావించి, అంతర్గత అభ్యర్థు లు సద్వినియోగం చేసుకోవాలి. పారదర్శకంగా ఎంపి క ప్రక్రియ నిర్వహిస్తాం. ఎలాంటి ప్రలోభాలకు తావులేదు. ఇతర ఎక్స్టర్నల్ నోటిఫికేషన్కు కూడా కసరత్తు చేస్తున్నాం.
-బలరాం, డైరెక్టర్ (పా)