She Team | సుల్తానాబాద్ రూరల్, మార్చి 08 : సీపీ ఆదేశాల మేరకు షీ టీమ్ ఇంచార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో ఇవాళ గర్రెపల్లిలో ఉపాధి హామీ పథకంలో పనులను చేస్తున్న మహిళలకు షీ టీం అవగాహన సదస్సు నిర్వహించారు. అందులో భాగంగా షీ టీం మెంబర్ స్నేహలత మాట్లాడుతూ మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలపై , యాంటీ డ్రగ్స్పై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహిళల రక్షణ కోసం ప్రతీ రోజు బస్టాండ్, ప్రధాన చౌరస్తాలో జన సమీకరణ ప్రాంతాల్లో కాలేజీల వద్ద షీ టీం నిరంతరంగా నిఘ ఉంచడం జరుగుతుందా..? అన్నారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థులు భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి సమస్య తెలపాలని కోరారు. ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని స్పష్టం చేశారు.
అలాగే అత్యాశకు పోయి సైబర్ క్రైమ్ ఆన్లైన్ మోసాలు, లోన్ యాప్స్ వేధింపులు గురవుతున్నారని వాటికి జోలికి పోకుండా ఉండాలని, ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి సమాచారం ఇవ్వాలని సూచించారు. మహిళలకు ఏదైనా ప్రమాదం ఉన్నట్లయితే, బెదిరింపులకు గురైతే వెంటనే 100 నంబర్కు కు డయల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో షీ టీమ్ సభ్యులు మౌనిక, సురేష్, మహిళలు పాల్గొన్నారు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్