పెద్దపల్లి : రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు భారం కావద్దని భావించి సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఒక లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తూ పేదింటి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న మనసున్న మారాజు కేసీఆర్ అని ప్రశంసించారు.
ఆదివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2, 4 డివిజన్ ల్లో ఇంటింటికి వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్ర పాలనలో తండాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితులు ఉండేవని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో ఆడపిల్ల పుడితే మహలక్ష్మి పుట్టిందని సంబురపడుతున్నరన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ గొప్ప పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. కార్యక్రమాల్లో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు ఎన్.వి. రమణా రెడ్డి, మేకల సదానందం, కుమ్మరి శ్రీనివాస్, నాయకులు బొడ్డు రవీందర్, ఈదూనూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.