సుల్తానాబాద్ రూరల్ అక్టోబర్ 30 : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కనకదుర్గ రైస్ మిల్లులో బుధవారం ప్రమాదవశాత్తు బాయిలర్ పేలిన సంఘటనపై గురువారం పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన సంఘటన స్థలాన్ని స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సంఘటన జరిగిన తీరును మిల్లు యజమాని తిరుపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఆయన వెంట గర్రెపల్లి సింగిల్ విండో చైర్మన్ జూపల్లి సందీప్ రావు, మోహన్ రెడ్డి , మనోజ్ గౌడ్, రాజ మల్లయ్య, రామారావు, గుడుగుల సతీష్, శ్యామ్, అరుణ్, శ్రీనివాస్ రెడ్డి, దయాకర్, చంద్రమౌళితో పాటు తదితరులున్నారు. అలాగే రైస్ మిల్లు యజమానులు, జైపాల్ రెడ్డి, పురుషోత్తం రావు, శ్రీనివాస్ రెడ్డితోపాటు తదితరులు సందర్శించారు.