పెద్దపల్లి : రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ కౌన్సిలర్ గుంపుల లక్ష్మి మంగళవారం రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన యావత్ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.
రైతుబంధు,రైతుబీమా, కల్యాణలక్ష్మి,మిషన్ భగీరథ వంటి అనేక పథకాలు అములు చేస్తూ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా నిలిపారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలకు అకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నరని, రాబోవు ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురడం ఖాయమని అన్నారు. రాష్ట్రాన్ని విధాల అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలన్నారు.