రామగిరి ఫిబ్రవరి 24: మేడిపల్లి శివారులోని భూములను ఎంజాయ్మెంట్ సర్వే(Enjoyment survey )కోసం వచ్చిన రెవెన్యూ అధికారులను సోమవారం రత్నాపూర్ గ్రామ రైతులు అడ్డుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం మేడిపల్లి శివారులోని భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి నోటీసులు విడుదల చేసిన విషయం విదితమే. దీని విషయంపై పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఫీల్డ్ మీదికి వచ్చిన రెవెన్యూ అధికారులను గ్రామ రైతులందరూ కలిసి అడ్డుకున్నారు. ఈ సర్వే చేసేందుకు రైతులందరూ నిరాకరించారు. ఈ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చి చెప్పారు.
దీంతో అక్కడికి వచ్చిన అధికారులు తమ పై అధికారులతో ఈ విషయంపై చర్చించి వారి సూచన మేరకు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం రైతులందరూ కలిసి పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్లి అసిస్టెంట్ కలెక్టర్ కు వినతి పత్రం అందించామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కొండు లక్ష్మణ్, మండల శంకర్, భద్రపు కృష్ణమూర్తి, భద్రపు శ్రీనివాస్, బర్ల వెంకన్న, కొవ్వూరి సురేష్, గేల్లు కృష్ణ, మండల శ్రీనివాస్, జక్కుల శివకుమార్, జక్కుల సది, తోట్ల రాయమల్లు, దాసరి నరేష్, ఎరుకలి బక్కయ్య, కొప్పుల కృష్ణకర్, మేడగొండ మహేష్, మధుకర్, బెజ్జల రాజయ్య, కండె గట్టయ్య పాల్గొన్నారు.