పెద్దపల్లి : తెలంగాణలోని ప్రతి గడపలో ఉన్న కుటుంబం ఆనందమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య సాయం అందక, వైద్య సమయానికి ఏ కుటుంబం దూరం కాకుండా ఉండేందుకే సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ నుంచి అందిస్తున్నారని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలు అందించని విధంగా ముఖ్యమంత్రి సహాయనిధి కింద పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారని ఆయన వివరించారు.
కార్యక్రమంలో ఎంపీపీలు బండారి స్రవంతి, నూనెటి సంపత్, కునారపు రేణుకాదేవి, జడ్పీటీసీలు వంగళ తిరుపతి రెడ్డి, బండారి రామ్మూర్తి, టీఆర్ ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు బోయిని రాజమల్లు, గంట రమేష్, నిశాంత్ రెడ్డి, సోమ శ్రీకాంత్, జాపతి రాజు, కాసిపాక వాసు, పల్లె మధు, రాపెల్లి శ్రీనివాస్, కీర్తి రాజయ్య తదితరులున్నారు.