జూలపల్లి, ఫిబ్రవరి 26 : గ్రామాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం 23 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ప్రభుత్వం లబ్ధిదారులకు రూ. 23, 27, 697 లక్షలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి ఇస్తుందని తెలిపారు.
కార్యక్రమంలో తాసిల్దార్ గిరి, సర్పంచులు పాటకుల అనూష, పుల్లూరి ప్రశాంతి, తొగరు శ్రీనివాస్, దండె వెంకటేశం, నాంపెల్లి సంపత్ కుమార్, పెంట కిషోర్, ధూళికట్ట మాజీ సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాలరావు, నాయకులు కొమ్మ పోశాలు, బొజ్జ శ్రీనివాస్, మల్లారపు సంతోష్, లోక జలపతి రెడ్డి, శాతళ్ల కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.