పెద్దపల్లి : రూ. 7,500 లంచం తీసుకుంటూ ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్ఖాన్ పేట గ్రామానికి చెందిన యాదగిరి శ్రీనివాస్ రాపెళ్లి సంతోష్ అనే రైతుల నుంచి కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్గా పనిచేస్తున్న కుమార్ రూ. 7500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.