కాల్వ శ్రీరాంపూర్ మార్చి 30 : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా కార్యకర్తలు కాల్వ శ్రీరాంపూర్ లో ప్రధాన రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెలకు రూ. 8000 వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన 1500 పారితోషికం వెంటనే అమలు చేయాలన్నారు.
ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశ కార్యకర్తలు తాండ్ర శారద, భూలక్ష్మి, మౌనిక, సునీత, సరోజన, వరలక్ష్మి, స్వప్న, రాధ, కృష్ణవేణి, స్వరూప, వాసవి తోపాటు తదితరులు పాల్గొన్నారు. వీరికి మద్దతుగా మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, బీఆర్ఎస్ నాయకుడు కూకట్ల నవీన్ రాస్తారోకోలో పాల్గొన్నారు.