పెద్దపల్లి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సంపత్రెడ్డి అనే వ్యక్తి మంథని మండలం ఎక్లాస్పూర్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆదివారం ఉదయం వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో సంపత్ రెడ్డిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మంథనిలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంపత్రెడ్డి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
in