ఈ చిత్రంలో కనిపిస్తున్న చెక్డ్యాం పెద్దపల్లి మండలం భోజన్నపేట-చీకురాయి గ్రామాల శివారులో ఉంది. కేసీఆర్ సర్కారు 49 కోట్లతో నిర్మించగా, కొన్నేళ్లుగా వాగొడ్డు రైతులకు ఆదరువుగా మారింది. గత ఫిబ్రవరిలో నీటితో కళకళలాడిన డ్యాం, నెల రోజుల వ్యవధిలోనే ఎడారిగా మారిపోవడంతో రైతన్న గుండె చెరువైంది.
పంట చేతికందే దశలో ఉండడం, వాగులో నీరు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఇప్పటికేof dried cropsను వదిలేయగా, మరికొందరు నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. వాగులో నీటి కోసం గుంతలను తవ్వించి, నీటిని పారించేందుకు తండ్లాడుతున్నారు.
– పెద్దపల్లి రూరల్, ఏప్రిల్ 1