ధర్మపురి, ఏప్రిల్ 20: ‘ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చిన్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ గాలికొదిలేసిన్రు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నరు? ఇదేం పాలన’ అంటూ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు. నాలుగు నెలల కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని మండిపడ్డారు. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ధర్మపురిలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం మాట్లాడారు. కేసీఆర్ పాలనలో కోటి ఇరవై లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, రైతులు పుట్ల కొద్దీ ధాన్యం పండించారని చెప్పారు.
పండిన ప్రతి గింజనూ కొని ఇబ్బందులు రాకుండా చూశామన్నారు. నాడు రాష్ట్రంలో ఫ్రెండ్లీ వాతావరణం ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం అభివృద్ధిపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు. అంతకుముందు ధర్మపురి లక్ష్మీనర్సింహాస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు. ఇక్కడ మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, నాయకులు అయ్యేరీ రాజేశ్, చిలివేరి శ్యాంసుందర్ స్తంభంకాడి మహేశ్, రామచంద్ర గౌడ్, మహేశ్ ఉన్నారు.