తెలంగాణచౌక్, జనవరి13: కరీంనగర్లోని బస్టాండ్కు సంక్రాంతి తాకిడి కనిపించింది. ప్ర యాణికులతో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఆవరణంతా రద్దీ కనిపించింది. ప్రభుత్వం వి ద్యాసంస్థలకు ఈనెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించండంతో నగరలోని వివిధ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమ సొంత గ్రామాలకు బయల్దేరారు. అంతేకాకుండా హైదరాబా ద్ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు పెద్దసంఖ్యలో జనాలు వస్తున్నారు.
ఆర్ఎం ఖుస్రోషాఖాన్, డిప్యూటీ ఆర్ఎం చందర్రావు హైదరాబాద్, జూబ్లీ స్టేషన్లో ఉండి ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 140 బస్సులను జూబ్లీ బస్స్టేషన్ నుంచి కరీంనగర్కు అదనంగా నడిపించారు. కరీంనగర్ నుంచి వరంగల్కు వెళ్లే ప్ర యాణికుల కోసం 16 బస్సులు ప్రత్యేకంగా నడిపించారు. కరీంనగర్కు చేరుకున్న ప్రయాణికులు ఉమ్మడి జిల్లాలో జగిత్యాల, గోదావరిఖని, మంచిర్యాల, మంథని, మెట్పల్లి, కోరుట్ల ,ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం అదనంగా బస్సులను తిప్పుతున్నారు. డిపో-1 మేనేజర్ ప్రణీత్, డిపో-2 మేనేజర్ మల్ల య్య బస్టాండ్లో ఏర్పాట్లను పర్యవేక్షించారు.