గంగాధర, మార్చి 23: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు కావాలా?, అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే నాయకుడు కావాలో ? ప్రజలు ఆలోచన చేయాలని బీఆర్ఎస్ చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మధురానగర్లో శనివారం ఆయన మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పన్యాల భూపతిరెడ్డి మాట్లాడుతూ, అబద్ధాలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ పార్టీ హామీలను నమ్మి ప్రజలు ఓటు వేసి, మోసపోయి గోసపడుతున్నారని గుర్తు చేశారు. కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి నయాపైసా తీసుకురాలేదన్నారు. మతాలు, కులాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టడమే తప్ప సంజయ్ చేసిందేమీ లేదన్నారు.
కరీంనగర్కు స్మార్ట్ సిటీ, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్, జాతీయ రహదారులను తీసుకువచ్చి, అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎంపీ వినోద్కుమార్కే దక్కుతుందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జడ్పీటీసీ రాంమోహన్రావు, సింగిల్ విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్, మెన్నేని రాజనర్సింగరావు, ఐల్నేని సాగర్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షులు మేచినేని నవీన్రావు, పులి వెంకటేశ్గౌడ్, వెల్మ శ్రీనివాస్రెడ్డి, జనగం శ్రీనివాస్, కత్తెరపాక కొండయ్య, మాజీ సర్పంచులు పునుగోటి కృష్ణారావు, కంకణాల విజేందర్రెడ్డి, ముక్కెర మల్లేశం, కర్ర శ్రీనివాస్రెడ్డి, గండ్ల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.