నాలుగోరోజూ ఉత్సాహంగా పల్లె, పట్టణ ప్రగతి
భాగస్వాములవుతున్న అధికారులు, ప్రజలు
గ్రామగ్రామాన శ్రమదానాలు
వీధివీధినా అవగాహన ర్యాలీలు
ఆయాచోట్ల పనులను పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు
పలు అభివృద్ధి పనులకూ ప్రారంభోత్సవం
కరీంనగర్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జోరందుకున్నాయి. సమస్యల పరిష్కారంతో పాటు స్వచ్ఛత దిశగా అడుగులు పడుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్వాడీ భవనాలను అధికారులు సందర్శించి పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కలు నాటేందుకు స్థలాలను పరిశీలించారు. కరీంనగర్లోని పలు డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో మేయర్ వై సునీల్రావు పాల్గొన్నారు. రామడుగు మండలం గుండి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు.
శంకరపట్నం మండల కేంద్రమైన కేశవపట్నంలో జడ్పీ సీఈఓ ప్రియాంక స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించారు. తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పాల్గొని శ్రమదానం చేశారు. చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామంలో జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. కాగా, జగిత్యాల పట్టణ 18వ వార్డులో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ విస్తృత పర్యటన చేశారు. మినీ స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు.
రామడుగు : గుండి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటుతున్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
జగిత్యాల : పట్టణ ప్రగతిలో భాగంగా రైతు బజార్లో మహిళా రైతులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ శ్రావణి
మంథని టౌన్: అంబేద్కర్నగర్లో పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, అధికారులు
హుజూరాబాద్టౌన్: శ్మశాన వాటికలో పరిసరాలను పరిశీలిస్తున్న బల్దియా ప్రత్యేక అధికారి శ్రీధర్, చైర్పర్సన్ గందె రాధిక
సిరిసిల్ల రూరల్: జిల్లెల్లలో నర్సరీని పరిశీలిస్తున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ జాయింట్ కమిషనర్ జాన్ వెస్లీ, అధికారులు